||సుందరకాండ ||

||ముప్పది ఇదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 33 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచత్రింశస్సర్గః

శ్లో|| తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ |
ఉవాచ వచనం సాంత్వ మిదం మథురయా గిరః||1||

స|| వైదేహీ వానరర్షభాత్ రామకథాం శ్రుత్వా మధురయా గిరః సాంత్వం ఇదం వచనం ఉవాచ||

తా|| వైదేహి ఆ వానరోత్తముని ద్వారా రామకథను విని మధురమైన మాటలతో శాంతముగా ఇట్లు పలికెను.

శ్లో|| క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణమ్|
వానరాణాం నరాణం చ కథామాసీత్ సమాగమః||2||
యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర|
తాని భూయః సమాచక్ష్వ న మాం శోకః సమావిశేత్||3||
కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం|
కథ మూరూ కథం బాహూ లక్ష్మణస్య చ శంస మే||4||

స||తే రామేణ సంసర్గః క్వ | లక్ష్మణం కథం జానాసి||నరాణాం వానరాణాం సమాగమః కథం ఆసీత్|| హే వానర ! రామస్య లింగాని యాని | లక్ష్మణస్య చ|| భూయః తాని సమాచక్ష్వ | ( తదా) మాం శోకః సమావిశేత్ ||రామస్య సంస్థానం కీదృశం | రామస్య రూపం కీదృశం| కథాం ఊరూ కథం బాహుః మే శంస| తథైవ లక్ష్మణస్య చ||

తా|| ' నీవు రామునితో ఎప్పుడు కలిసితివి ? లక్ష్మణుని ఎటుల నెఱుంగుదువు? నరులకు వానరులకు సమాగమము ఎట్లు సంభవించెను. ఓ వానరా రాముని చిహ్నములు ఏమి ? లక్ష్మణుని చిహ్నములు ఏమి? అవి నీవు మళ్ళీ చెప్పుము. అప్పుడు నా శోకము శమించును. రాముని సంస్థానమెట్లుండును? రాముని రూపము ఎట్లుండును?ఊరువులు బాహువులు ఎట్లుండును ? అలాగే లక్ష్మణుడెట్లుండును?'

శ్లో|| ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్మారుతాత్మజః|
తతో రామం యథా తత్త్వ మాఖ్యాతుముపచక్రమే||5||
జానంతీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి|
భర్తుః కమల పత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ||6||
యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై|
లక్షితాని విశాలాక్షీ వదతః శ్రుణు తాని మే||7||

స|| వైదెహ్యా ఏవం ఉక్తస్తు తతః హనుమాన్ మారుతాత్మజః రామం తత్త్వం ఆఖ్యాతుం ఉపచక్రమే||కమలపత్రాక్షీ వైదేహి భర్తుః లక్ష్మణస్య చ సంస్థానం జానంతి (అపి) దిష్ట్యా మాం పరిపృచ్ఛసి బత ||యాని రామస్య లక్ష్మణస్యచ చిహ్నాని యాని వై లక్షితాని తాని వదతః | మే శ్రుణు||

తా|| అప్పుడు వైదేహి చేత ఇట్లు అడగబడిన మారుతాత్మజుడగు హనుమంతుడు, రాముని యథాతథముగా వర్ణించుటకు ఉపక్రమించెను. "ఓ కమలపత్రాక్షీ వైదేహీ భర్త లక్ష్మణుల సంస్థానము తెలిసి కూడా నా అదృష్ఠము కొలదీ నన్ను అడుగుచున్నావు. రామలక్ష్మణులు చిహ్నములు ఏవి ఉన్నవో అవి చెప్పెదను వినుము".

శ్లో|| రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః|
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతే జనకాత్మజే||8||
తేజసాఽఽదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ద్యా యశసా వాసవోపమః||9||
రక్షితా జీవలోకస్య స్వజన స్యాభిరక్షితా|
రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః||10||
రామోభామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా|
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః||11||

స|| జనకాత్మజే ప్రసూతే రామః కమలపత్రాక్షః | సర్వసత్త్వ మనోహరః | రూపదాక్షిన్య సంపన్నః||తేజసా ఆదిత్య సమః| క్షమయా పృథివీ సమః| బుద్ధ్యా బృహస్పతి సమః | యశసా వాసవః ఉపమః||జీవలోకస్య రక్షితా | స్వజనస్యాభి రక్షితా| పరంతపః| స్వస్య వృత్తస్య ధర్మస్య చ రక్షితా||హే భామిని | లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా |సః లోకస్య మర్యాదానాం కర్తా చ కారయితా చ||

తా|| "ఓ జనకాత్మజా ! రాముడు పుట్టుకతో కమలపత్రాక్షుడు. అన్ని విధములుగా మనోహరుడు. రూపము దక్షత సంపదలుగా గలవాడు. తేజస్సులో సూర్యునితో సమానుడు. క్షమలో భూమితో సమానుడు. బుద్ధిలో బృహస్పతి తో సమానుడు. యశస్సులో ఇంద్రునితో సమానుడు. జీవలోకమును రక్షించువాడు. తన జనములను రక్షించువాడు. శతృవులను తపించు పరంతపుడు. తనను ఆశ్రయించినవారిని ధర్మమును రక్షించువాడు. ఓ దేవి లోకములో నాలుగు వర్ణములవారిని రక్షింఛువాడు. అతడు లోకములో మర్యాదలను నిలపెట్టువాడు పాటించువాడు'.

శ్లో|| అర్చిష్మా నర్చితోఽత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః|
సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞః శ్చ కర్మణామ్||12||
రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణనాముపాసితా|
శ్రుతవాన్ శీలసంపన్నో వినీతశ్చ పరంతప||13||
యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః|
ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః||14||

స|| అత్యర్థం అర్చిష్మాన్ అర్చితః | బ్రహ్మచర్య వ్రతే స్థితః | సాధూనాం ఉపకారజ్ఞః కర్మణాం ప్రచారజ్ఞః చ||సః రాజవిద్యా వినీతః | బ్రాహ్మణానాం ఉపాసితా చ| (సః) పరంతపః శ్రుతవాన్ శీలసంపన్నః వినీతః చ||యజుర్వేద వినీతః | వేదవ్ద్భిః సుపూజితః చ|| వేదేషు వేదాంగేషు ధనుర్వేదే చ నిష్ఠితః||

తా|| " అత్యంత తేజోమయుడు. పూజితుడు. బ్రహ్మచర్య వ్రతములో నిష్ఠగలవాడు. సాధువులకు ఉపకారము చేయుటలో ప్రజ్ఞకలవాడు. కర్మలను పాటించుటలో పాటింపచేయబడుటలో ప్రజ్ఞ కలవాడు. అతడు రాజవిద్యా వినీతుడు. బ్రాహ్మణులను ఆదరించువాడు. అతడు పరంతపుడు. వేదవిద్యలలో పారంగతుడు. శీలము కలవాడు.బుద్ధిమంతుడు. యజుర్వేదము తెలిసినవాడు. వేదములను తెలిసిన వారిచేత పూజింపబడువాడు. వేదములలోనూ వేదాంగములలోనూ ధనుర్వేదములోనూ నిష్ఠ కలవాడు".

శ్లో|| విపులాంసో మహాబాహుః కంబుగ్రీవః శుభాననః|
గూఢజత్రుః సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః||15||
దుందుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్|
సమ స్సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః||16||

స|| దేవి విపులాంసః మహాబాహుః కంబుగ్రీవః శుభాననః ఘూఢజత్రుః సుతామ్రాక్షః రామః జనైః శ్రుతః||దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగః శ్యామం వర్ణం సమాశ్రితః ||

తా|| " ఓ దేవి రాముడు విశాలమైన భుజములు కలవాడు. పెద్ద బాహువులు కలబాడు. కంఠము శంఖాకారములో నున్నవాడు. మంగళప్రదమైన ముఖము కలవాడు. రాముడు మూపుసంధి ఎముకలు గూఢముగా గలవాడు. మంచి తామ్రవర్ణముగల కళ్ళు కలవాడు. రాముడు లోకములో అందరికి తెలిసినవాడు. రాముని స్వరము దుందుభి వంటిది. నిగనిగలాడు మేలిమి ఛాయకలవాడు. ప్రతాపము కలవాడు. అన్ని అవయవములు సమానమైన ప్రమాణములో కలవాడు. శ్యామవర్ణముతో నిండినవాడు".

శ్లో|| త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషుచోన్నతః|
త్రితామ్ర త్రిషు చ స్నిగ్ధో గంభీర త్రిషు నిత్యశః||17||
త్రివలీవాం స్త్ర్యవనతః చతుర్వ్యంగః త్రిశీర్షవాన్|
చతుష్కలః చతుర్లేఖః చతుష్కిష్కుః చతుస్సమః||18||

స|| త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషు చ ఉన్నతః స్నిగ్ధః నిత్యశః త్రిషు గంభీరః ||త్రివలీవాం స్త్ర్యవనతః చతుర్వ్యంగః త్రిశీర్షవాన్ చతుష్కలః చతుశ్కిష్కుః చతుస్సమః ||

తా|| మూడు స్థలములలో ( వక్షస్థలము, మణీకట్టు ,పిడికెట్టు) ధృఢముగా కలవాడు. మూడు స్థలములలో ( బాహువులు కనుబొమలు వృషణకోశము) దీర్ఘముగావుండువాడు. మూడు ప్రదేశములలో అవయవములు (నాభి రొమ్ము పొత్తికడుపు) ఎత్తైనవిగా అమరి వున్నాయి. మూడు చోట్లలో ( అర చేయి అరికాళ్ళూ గోళ్లు) ఎఱ్ఱని రంగు కలవాడు. మూడు విధములుగా ( నడకతీరు,నిలబడు విధానము, కంఠస్వరము) గంభీరముగా వుండువాడు. ఉదరముపై మూడు మడతలు కలవాడు. స్తనములు స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా నున్నవాడు. నాలుగు ( కంఠము లింగము వీపు పిక్కలు) హ్రస్వమైనవి. తలపై మూడు సుడులు కలవాడు. (అంగుష్ఠముపై) నాలుగు రేఖలు కలవాడు. నాలుగు మూరల ఎత్తు గలవాడు. నాలుగు చోట్ల ( బాహువులు మోకాళ్ళు తోడలు చెక్కిళ్ళు) సమానమైన ప్రమాణములలో ఉండువాడు.

శ్లో|| చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్ట్రః చతుర్గతిః|
మహోష్ఠహనునాసశ్చ పంచస్నిగ్ధోఽష్టవంశవాన్||19||
దశపద్మో దశబృహ త్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్|
షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః||20||
సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః|
దేశకాలవిభాగజ్ఞః సర్వలోకప్రియం వదః||21||
భ్రాతా చ తస్య ద్వైమాత్ర సౌమిత్రి రపరాజితః|
అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిథః||22||

స|| చతుర్దశసమద్వంద్వః చతుర్దంష్ట్రః చతుర్గతిః మహోష్టహనునాసః చ పంచస్నిగ్ధః అష్టవంశవాన్ || దశపద్మః దశబృహః త్రిభిః వ్యాప్తః ద్విశుక్లవాన్ షడున్నతః నవతనుః త్రిభిః వ్యాప్నోతి|| సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాలవిభాగజ్ఞః సర్వలోకప్రియం వదః||తస్య భ్రాతా చ ద్వైమాత్రః సౌమిత్రిః అపరాజితః అనురాగేణ రూపేణ గుణేన చ తథావిధః||

తా|| పద్నాలుగు జతల అంగములు సమముగా కలవాడు ( కనుబొమ్మలు, నాశికపుటములు,కళ్ళు, పెదవులు, చెవులు, చేతులు, మోచేతులు , మణికట్లు, స్తనాగ్రములు, పిరుదులు, వృషణములు,మోకాళు, పాదములు , నడుము ఇరుప్రక్కలు), నాలుగు ( ముందు పళ్ళు) దంతములు కలవాడు. నాలుగు విధములగు ( సింహ శార్దూల వృష భగజ) నడకతీరు కలవాడు. మహత్తరమైన దవడలు, ముక్కు కలవాడు. ఇదు చోట్ల ( కళ్ళు, పళ్ళు, చర్మము, పాదములు. కేశములు) నిగనిగలాడుచుండువాడు. రాముని శరీరములో అష్టవంశములు ( శరీరము,చేతివేళ్ళు, కాలివేళ్ళు,చేతులు, నాశికలు,నేత్రాలు చెవులు వృషణములు) సమానమైన ప్రమాణములో కలవాడు. పది విధములుగా పద్మము పోలియుండువాడు ( ముఖము, నేత్రములు, నోరు నాలుక , పెదవులు, దవడలు స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు). పది అవయవములు విపులముగా అమరి వుండువాడు( శిరస్సు, నుదురు,చెవులు, కంఠము, వక్షము , హృదయము, పొట్ట చేతులు, కాళ్ళు వీపు). మూడు (తేజస్సు, కీర్తి సంపద) తో ప్రఖ్యాతి కలవాడు. రెండిటిని ( మాతృ పితృ వంశములను)పావనము చేసినవాడు. ఆరు అంగములు ఉన్నతమైన వాడు( చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము). తొమ్మిది తనువులు కలవాడు. మూడు కాలములలో ధర్మార్థకామములను ఆచరించువాడు. సత్యధర్మములను ఆచరించువాడు , సకలైశ్వర్య సంపన్నుడు, సంగ్రహించుట అనుగ్రహించుటలో రక్తికలవాడు, దేశకాలముల జ్ఞానము కలవాడు, లోకములో అందరికి ప్రియముకలుగునట్లు మాట్లాడువాడు. అతని తమ్ముడు, సవితితల్లి కోడుకు , సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు అపరాజితుడు. రూపము అనురాగము గుణములలోరాముని వంటి వాడే.

శ్లో|| తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శనసముత్సుకౌ|
విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ||23||
త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరామ్|
దదర్శతు ర్మృగపతిం పూర్వజేనావరోపితమ్||24||
ఋశ్యమూకస్య పృష్ఠే తు బహుపాదపసంకులే|
భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనమ్||25||
వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరమ్|
పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితమ్||26||

స|| తౌ ఉభౌ నరశార్దూలౌ త్వత్ దర్శన సముత్సుకౌ మహీం విచిన్వంతౌ అస్మాభీ అభిసంగతౌ కృత్స్నాం|| త్వాం ఏవ మార్గమణౌ వసుంధరాం విచిన్వంతౌ పూర్వజేన(వాలినా) అవరోపితం మృగపతిం ( సుగ్రీవం)దదర్శ||బహుపాదప సంకులే ఋష్యమూకస్య పృష్ఠే భ్రాతుః భయార్తం ప్రియదర్శనం సుగ్రీవం దదర్శ||వయం తు పూర్వజేన రాజ్యాత్ అవరోపితం సత్యసంగరం హరిరాజం తం సుగ్రీవం పరిచర్యామహే||

తా|| ఆ నరశార్దూలు ఇద్దరూ నీ దర్శనముకై ఆతురతతో భూమండలము అంతా వెతుకుతూ మమ్ములను కలుసుకున్నారు. నిన్ను వెతుకుతూవున్న సమయములో పూర్వజునిచేత బహిష్కృతుడైన వానరాధీశుని చూచెను. ఆ నరశార్దూలు ఇద్దరూ అనేకమైన వృక్షములు కల ఋష్యమూక పర్వతములో అన్నతో భయపడి దాగివున్న ప్రియదర్శనుడగు సుగ్రీవుని కలిసిరి. మేము కూడా వానరాధీశుడగు, సత్యపరాధీనుడైన, రాజ్యమునుంచి అగ్రజునిచేత వెడలగొట్తబడిన సుగ్రీవుని పరిచర్యలలో వున్నవారము.

శ్లో|| తతస్తౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ|
ఋశ్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ||27||
స తౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః|
అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః||28||
తతః స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః|
తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరమ్||29||

స|| తతః తౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశం ఉపాగతౌ ||సః వానరర్షభః తౌ నరవ్యాఘ్రౌ దృష్ట్వా భయమోహితః తస్య గిరేః శిఖరం అవప్లుతౌ || సః వానరేంద్రః తస్మిన్ శిఖరే వ్యవస్థితః తతః తయోః ( రామలక్ష్మణయోః) సమీపం మాం ఏవ సత్వరం ప్రేషయామాస||

తా|| అప్పుడు నారచీరలు ధరించిన ధనస్సును చేతిలో పట్టుకున్న వారిద్దరూ ఋష్యమూక పర్వతమువద్దనున్న రమ్యమైన ప్రదేశమునకు వచ్చితిరి. నరవ్యాఘ్రములవలెనున్న ఆ నరవరులను చూచి భయపడినవాడై వానరాధీశుడు ఆ పర్వత శిఖరముకు ఎగిరి వెళ్ళెను. ఆవానరేంద్రుడు ఆ శిఖరమునందే ఉండి ఆ వారిద్దరి సమీపమునకు నన్ను వెంటనే పంపించెను.

శ్లో|| తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ప్రభూ |
రూపలక్షణసంపన్నౌ కృతాంజలిరుపస్థితః||30||
తౌ పరిజ్ఞాతతత్వార్థౌ మయా ప్రీతిసమన్వితౌ|
పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ||31||
నివేదితౌ చ తత్త్వేన సుగ్రీవాయ మహాత్మనే|
తయో రన్యోఽన్య సల్లపాద్భృశం ప్రీతి రజాయత||32||
తతస్తౌ ప్రీతిసంపన్నౌ హరీశ్వరనరేశ్వరౌ|
పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వ వృత్తయా||33||

స|| అహం సుగ్రీవవచనాత్ ప్రభూ పురుషవ్యాఘ్రౌ రూపలక్షణసంపన్నౌతౌ కృతాంజలిః ఉపస్థితః ||పరిజ్ఞాత తత్త్వార్థౌ పురుషర్షభౌ ప్రీతిసమన్వితౌ తం మయా పృష్ఠమారోప్య దేశం ప్రాపితౌ ||మహాత్మనే సుగ్రీవాయ తత్త్వేన నివేదితౌ తయోః అన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతిః అజాయత||తతః ప్రీతిసంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పూర్వవృత్త కథయా పరస్పర కృత ఆశ్వాసౌ||

తా|| " నేను ప్రభువైన సుగ్రీవుని వచనములతో రూపలక్షణసంపన్నులగు వారిద్దరికి అంజలిఘటించి నిలబడితిని. వారి తత్త్వమును తెలిసికొనిన నేను ప్రీతి ప్రసన్నతకల వారిద్దరినీ నా పృష్ఠముపై నెక్కించుకొని వారిని మా దేశమునకు కొనిపోయితిని. మహాత్ముడైన సుగ్రీవునకు వారి తత్త్వము నివేదించిన పిమ్మట వారిద్దరి అన్నోన్య సల్లాపములతో మైత్రి ఉదయించెను. అలాగ ప్రీతిసంపన్నులగు వారిద్దరూ పూర్వము జరిగిన వృత్తాంతములతో పరస్పర ఆశ్వాసము పొందిరి".

శ్లో|| తతః స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః|
స్త్రీ హేతోః వాలినా భ్రాత్రా నిరస్త మురుతేజసా||34||
తతస్త్వన్నాశజం శోకం రామస్యా క్లిష్టకర్మణః|
లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్ ||35||
స శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః|
తదాసీన్నిష్ప్రభోఽత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్||36||

స|| తతః స్త్రీహేతోః భ్రాత్రా వాలినా నిరస్తం సుగ్రీవం ఉరుతేజసా లక్ష్మణాగ్రజః సాంత్వయామాస||తతః లక్ష్మణః అక్లిష్టకర్మణః రామస్య త్వన్నాశజం శోకం వానరేంద్రస్య సుగ్రీవాయ న్యవేదయత్ ||సః వానరేంద్రః తు లక్ష్మణేన ఈరితం వచః తదా గ్రహగ్రస్తః అంశుమాన్ ఇవ అత్యర్థం నిష్ప్రభః ఆసీత్ ||

తా|| అప్పుడు స్త్రీ కారణముగా అన్నయైన వాలిచేత వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని లక్ష్మణాగ్రజుడు ఊరడించెను. అప్పుడు లక్ష్మణుడు క్లిష్ఠమైన కార్యములు సాధించ గల రాముని దహించుతున్న శోకమును ఆ వానరేంద్రునికి నివేదించెను. ఆ వానరేంద్రుడు లక్ష్మణుని చేత చెప్పబడిన మాటలను విని గ్రహము పట్టిన సూర్యుని వలె తేజోవిహీనిడయ్యెను.

శ్లో|| తతస్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమాణయా|
యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే||37||
తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూధపాః|
సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవ||38||
తాని రామాయ దత్తాని మయై వోపహృతాని చ|
స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతచేతసి||39||
తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ|
తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవతమ్||40|

స|| తతః త్వత్ గాత్రశోభీని యాని ఆభరణజాలాని మహీతలే పాతితాని (దర్శయామాశుః)||హరియూధపాః తాని సర్వాణి ఆనీయ సంహృష్టా రామాయ దర్శయామాస| తవ సు గతిం తు న విదుః||మయైవ ఉపహృతాని తాని రామాయ దత్తాని | తస్మిన్ విగతచేతసి స్వనవంతి అవకీర్ణాని || దర్శనీయాని తవ తాని అంకే కృత్వా దేవప్రకాశేన తేన దేవేన బహువిధం పరిదేవితమ్||

తా|| అప్పుడు భూమిపై పడిన నీ అవయవములకు శోభను కలిగించు ఆభరణజాలమును చూపించెను. వానర ముఖ్యులు ఆ ఆభరణములన్ని తీసుకువచ్చి సంతోషముతో రామునకు చూపించ సాగిరి. నీవు ఎక్కడికి తీసుకుపోబడితివో ఆ మార్గము వారికి తెలియదు. నా చేత సేకరింపబడిన వాటిని రామునికి ఇచ్చితిమి. వాటిని చూడగానే గుర్తించిన రాముడు మూర్చ్ఛిల్లెను. చూపించినవానిని తన ఒడిలో ఉంచుకొని దేవతలవలె ప్రకాశించుచున్న ఆ దేవుడు పరిపరివిధములుగా విలపించెను.

శ్లో|| పశ్యతస్తాని రుదత స్తామ్యతశ్చ పునః పునః|
ప్రాదీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనమ్||41||
శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా|
మయాపి వివిధైర్వాక్యైః కృఛ్ఛా దుత్థాపినః పునః||42||
తాని దృష్ట్వా మహాబాహుః దర్శయిత్వా ముహుర్ముహుః|
రాఘవః ససౌమిత్రిః సుగ్రీవే స న్యవేదయత్||43||
స త్వాదర్శనాదార్యే రాఘవః పరితప్యతే|
మహతా జ్వలతా నిత్యమగ్నినేవాగ్ని పర్వతః||44||

స|| తాని పశ్యతః రుదతః పునః పునః తామ్యతశ్చ దాశరథేః శోకహుతాశనం తాని ప్రదీపవాన్ ||దుఃఖార్తేన తేన మహాత్మనా శయితం చ మయాపి వివిధైః వాక్యైః కృచ్ఛాత్ పునః ఉత్థాపితః ||తాని దృష్ట్వా మహాబాహుః ముహుః ముహుః దర్శయిత్వా రాఘవః స సౌమిత్రిః సుగ్రీవే న్యవేదయత్ ||ఆర్య సః రాఘవః తవ అదర్శనాత్ నిత్యం మహతా అగ్నినా అగ్నిపర్వత ఇవ జ్వలతే పరితప్యతే ||

తా|| " వాటిని ( ఆ అభరణములను) చూస్తూ మళ్ళీ మళ్ళీ విలపిస్తూ మండిపోతున్న దాశరథి శోకమును అవి మరింప ప్రజ్వలింపచేశాయి. దుఃఖములో మునిగి పడిపోయిన ఆ మహాత్ముని నేను కూడా వివిధ మాటలతో లేవతీసితిని. ఆ అభరణములను చూచి ఆ మహాబాహువులు కల రాఘవుడు మరల చూచి సౌమిత్రితో కలిసి సుగ్రీవునకు అప్పగించెను. ఆర్యుడైన రాఘవుడు నీ దర్శనము లేక అగ్ని పర్వతము వలె జ్వలించుచూ పరితపిస్తున్నాడు".

శ్లో|| త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవమ్|
తాపయంతి మహాత్మానమగ్న్యగార మివాగ్నయః||45||
తవాదర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే|
మహతా భూమికంపేన మహానివ శిలోచ్చయః||46||
కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ|
చరన్ న రతిమాప్నోతి త్వా మపశ్యన్ నృపాత్మజే||47||

స|| త్వత్కృతే మహాత్మానం తం రాఘవం అనిద్రా చ శోకః చింతా చ అగ్న్యగారం అగ్నయః ఇవ తాపయంతి ||తవ అదర్శన శోకేన రాఘవః మహతా భూమికంపేన మహాన్ శిలోచ్ఛయః ఇవ ప్రవిచాల్యతే ||త్వాం అపశ్యన్ సురమ్యాణి ప్రస్రవణాని చరన్ నృపాత్మజః రతిం న ఆప్నోతి ||

తా|| "నీగురించి మాహాత్ముడగు ఆ రాముడు నిద్రలేక శోకముతో చింతతో అగ్నిచే ప్రజ్వలిస్తున్న అగ్ని పర్వతము వలె తపించిపోతున్నాడు. నీ దర్శనము లేక శోకములో రాఘవుడు మహత్తరమైన భూకంపముతో చలించిన మహత్తరమైన పర్వతము వలె చలించి పోతున్నాడు. నిన్ను కానక రమ్యమైన వనములలో తిరుగుతున్నప్పటికీ రతిని పొందుటలేదు".

శ్లో|| సత్వాం మనుజశార్దూల క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః|
సమిత్రభాంధవం హత్వా రావణం జనకాత్మజే||48||
సహితౌ రామసుగ్రీవావుభావకురుతాం తదా|
సమయం వాలినం హంతుం తవచాన్వేషణం తథా||49||
తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః|
కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః||50||
తతో నిహత్య తరసా రామో వాలిన మాహవే|
సర్వేషాం హరి సంఘానాం సుగ్రీవమకరోత్ పతిమ్||51||

స|| జనకాత్మజే మనుజశార్దూలః రాఘవః సమిత్రబాంధవం రావణం హత్వా త్వాం క్షిప్రం ప్రాప్స్యతి ||తదా రామసుగ్రీవౌ ఉభౌ సహితౌ వాలినం హంతుం తథా తవ చ అన్వేషణం సమయం అకురుతామ్ ||తతః స హరీశ్వరః తాభ్యాం వీరాభ్యాం కుమారాభ్యం సహ కిష్కింధాం ఉపాగమ్య యుద్ధే వాలీ నిపాతితః||తతః రామః ఆహవే తరసా వాలినం నిహత్య సుగ్రీవం సర్వేషాం హరిసంఘానాం పతిం అకరోత్ ||

తా|| "ఓ జనకాత్మజా మనుజ శార్దూలుడు రాఘవుడు రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి నిన్ను తప్పక పొందును. అప్పుడు రామసుగ్రీవులిద్దరూ వాలిని హతమార్చుటకూ అలాగే నీ అన్వేషణమునకు అంగీకారముకు వచ్చితిరి. అప్పుడు ఆ హరీశ్వరుడు వీరులగు రాజకుమారులిద్దరితో కిష్కింధ వచ్చి యుద్ధములో వాలిని సంహరించిరి. అప్పుడు రాముడు యుద్ధములో వాలిని సంహరించి సుగ్రీవుని సమస్త వానర సంఘములకూ అధిపతిగా చేసెను".

శ్లో|| రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత|
హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతమ్||52||
స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ |
త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్ ||53||
అదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా|
అద్రిరాజ ప్రతీకాశాః సర్వతః ప్రస్థితా మహీమ్||54||

స|| దేవీ రామసుగ్రీవయోః ఇక్యం ఏవం సమజాయత | మాం తయోః దూతం ఇహ ఆగతం చ హనుమంతం విద్ధి | సుగ్రీవః స్వరాజ్యం ప్రాప్య హరీశ్వరాన్ సమానీయ త్వదర్థం దశ దిశః మహాబలాన్ ప్రేషయామాస||వానరేంద్రేణ మహౌజసా సుగ్రీవేణ అదిష్టాః అద్రిరాజప్రతీకాశః మహీం సర్వతః ప్రస్థితా||

తా|| " ఓ దేవీ రామసుగ్రీవుల ఐక్యము ఈ విధముగా కుదిరెను. నన్ను వారిద్దరి దూతగా ఇక్కడికి వచ్చిన హనుమంతుడు అని తెలిసికొనుము.సుగ్రీవుడు స్వరాజ్యము పొంది వానరలందరిని పిలిపించి నీ అన్వేషణార్థము పది దిక్కులలో మహాబలము కలవారిని పంపసాగెను. వానరేంద్రుడు మహాతేజస్సుగల సుగ్రీవుని అదేశము ప్రకారము నిన్ను వెతుకుటకై బయలుదేరిరి".

శ్లో|| తతస్తు మార్గామాణావై సుగ్రీవ వచనాతురాః|
చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః||55||
అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూను ర్మహాబలః|
ప్రస్థితః కపిశార్దూలః త్రిభాగబలసంవృతః||56||
తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వతసత్తమే|
భృశం శోకపరీతానా మహోరాత్రగణా గతాః||57||

స|| తతః తే వయం అన్యే వానరాః చ సుగ్రీవ వచనాతురాః మార్గమాణాః కృత్స్నాం వసుధాం చరంతి ||వాలిసూనుః మహాబలః లక్ష్మీవాన్ త్రిభాగబలసంవృతః కపిశార్దూలః అంగదః నామ ప్రస్థితః ||వింధ్యే పర్వతసత్తమే విప్రణష్టానామ్ భృశం శోకపరీతానాం తేషాం నః అహోరాత్రగణాః గతాః||

తా|| " అప్పుడు మేము ఇతర వానరులు సుగ్రీవుని ఆదేశానుసారము నిన్ను వెదుకుతూ భూమండలము అంతా తిరుగుచున్నాము. కపిశార్దూలుడు వాలిసూనుడు లక్ష్మీవంతుడు అగు అంగదుడు మూడుభాగములలో ఒకవంతు సైన్యముతో బయలుదేరెను. వింధ్యపర్వతములలో దారితెన్నూతెలియక అత్యంత శోకసముద్రములో అహోరాత్రములు గడిచినవి".

శ్లో|| తే వయం కార్యనైరాశ్యాత్ కాలస్యాతిక్రమణే|
భయాచ్చ కపిరాజస్య ప్రాణాం స్త్యక్తుం వ్యవస్థితాః||58||
విచిత్య వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ|
అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాం స్త్యక్తుం సముద్యతాః||59||
దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్|
భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః||60||

స|| తే వయం కార్యనైరాశ్యాత్ కాలస్య అతిక్రమేణ చ కపిరాజస్య భయాత్ చ ప్రాణామ్ త్యక్తుం వ్యవస్థితాః||వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ విచిత్య దేవ్యాః పదం అనాసాద్య ప్రాణాం త్యక్తుం సముద్యతాః |ప్రాయోపవిష్టాన్ సర్వాన్ వానరాన్ దృష్ట్వా అంగదః భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయత్ ||

తా|| " మేము అందరము కార్య నిరాశవలన కాలము గడిచిపోవుటవలన కపిరాజుపై భయముతో ప్రాణములు త్యజించుటకు సిద్ధపడితిమి. వనదుర్గములు కోండలు లోయలూ అన్వేషించి దేవి యొక్క స్థానము కనుగొనలేక ప్రాణములను త్యజించుటకు సిద్ధపడితిమి. ప్రాయోపవేశమునకు సిద్ధపడిన వానరులందరినీ చూచి అంగదుడు దుఃఖసాగరములో మునిగిపోయెను".

శ్లో|| తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా|
ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషుః||61||
తేషాం న స్స్వామిసందేశా న్నిరాశానాం ముమూర్షతాం|
కార్యహేతో రివాయత శ్శకుని ర్వీర్యవాన్ మహాన్||62||
గృధరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధరాట్|
శ్రుత్వా భాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్||63||

స|| వైదేహీ తవ నాశం చ వాలినః వధః చ జటాయుషుః మరణం చ అస్మాకం ప్రాయోపవేశం ||స్వామిసందేశాత్ నిరాశానామ్ ముమూర్షతాం తేషాం నః కార్యహేతోః ఇవ వీర్యవాన్ మహాశకునిః ఆయాతః || గృధరాజస్య సోదరః గృధరాట్ సంపాతిః నామ భాతృవధం కోపాత్ ఇదం వచనమ్ అబ్రవీత్||

తా|| " ఓ వైదేహీ నీ అన్వేషణావిఫలము, వాలి వథ, జటాయుషు మరణము ఇవన్ని కారణములయ్యెను. స్వామి అదేశములపై నిరాశతో ప్రాణత్యాగమునకు సిద్ధమైన సమయములో సమయనుకూలముగా వీరుడైన గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చెను. పక్షిరాజు సోదరుడు సంపాతి అనబడు పక్షిరాజు భాతృ వధగురించి విని కోపముతో ఇట్లు పలికెను".

శ్లో|| యవీయాన్కేన మే భ్రాతా హతః క్వ చ నిపాతితః|
ఏత దాఖ్యాతు మిచ్చామి భవద్భిః వానరోత్తమాః||64||
అంగదోఽకథయ త్తస్య జనస్థానే మహద్వధమ్|
రక్షసా భీమరూపేణ త్వా ముద్దిశ్య యథాతథమ్||65||
జటయుషో వధం శ్రుత్వా దుఃఖిత స్సోఽరుణాత్మజః|
త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే||66||
తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనమ్|
అంగదప్రముఖా స్తూర్ణం తతః సంప్రస్థితా వయమ్||67||

స|| వానరోత్తమః మే యావీయాన్ భ్రాతా కేన హతః క్వ చ నిపాతితః భవద్భిః ఏతత్ ఆఖ్యాతుం ఇఛ్ఛామి ||త్వమ్ ఉద్దిశ్య అంగదః భీమరూపేన రక్షసా జనస్థానే మహద్వధం యథాగతం తస్య అకథయత్ || వరారోహే సః అరుణాత్మజః జటాయుషః వధః శుత్వా దుఃఖితః త్వాం రావణాలయే వసంతీం శశంస||తస్య సంపాతేః ప్రీతివర్ధనం తత్ వచనం శ్రుత్వా అంగదప్రముఖాః వయం తూర్ణమ్ తతః ప్రస్థితః||

తా|| "వానరోత్తములారా నా తమ్ముడు ఎవరిచేత ఎక్కడ హతమార్చబడెనో మీచేత చెప్పబడుటకు కోరుచున్నాను'. అప్పుడు నీ కొఱకు భీమరూపముగల రాక్షసుడు జనస్థానములో చేసిన (జటాయు) మహావథను యథా తథముగా చెప్పితిని. ఓ వరాననా ఆ అరుణాత్మజుడు జటాయువు మరణము విని దుఃఖపడి నువ్వు రావణుని అంతఃపురములో వున్నట్లు చెప్పెను. ఆ సంపాతి యొక్క ప్రీతిని కలిగించు మాటలు విని అంగదప్రముఖులు మేము అందరము అచటినుంచి వెంటనే బయలు దేరితిమి'.

శ్లో|| వింధ్యా దుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంత ముత్తరమ్|
త్వద్దర్శనకృతోత్సాహా హృష్టాః తుష్టాః ప్లవంగమాః||68||
అంగదప్రముఖాస్సర్వే వేలోపాంత ముపస్థితాః|
చింతాం జగ్ముః పునర్భీతాః త్వద్దర్శనసముత్సకాః||69||
అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః|
వ్యవధూయ భయం తీవ్రం శతం ప్లుతః||70||

స|| ప్లవంగమాః త్వత్ దర్శనకృతోత్సాహాః హృష్టాః తుష్టాః వింధ్యాత్ ఉత్థాయ సాగరస్య ఉత్తర అంతం సమ్ప్రాప్తాః||అంగదప్రముఖాః సర్వే త్వత్ దర్శనముత్సుకాః వేలోపాంతం ఉపస్థితాః భీతాః పునః చింతాం జగ్ముః||అథ అహం సాగరం ప్రేక్ష్య సీదతః హరిసైన్యస్య తీవ్రం భయం వ్యవధూయ యోజనానాం శతం ప్లుతః||

తా|| "ఆకాశములో ఎగరగలవారందరమూ నీ దర్శనము కలుగుననే ఉత్సాహముతో వింధ్యపర్వతమునుంచి లేచి సాగరము యొక్క ఉత్తర తీరము చేరితిమి. అంగద ప్రముఖులు నిన్ను చూడవలను ఉత్సాహముతో సముద్రతీరము చేరి, సముద్రము చూచి భయపడి మరల చింతాక్రాంతులైరి. అప్పుడు నేను సాగరము చూచి వానరసైన్యము యొక్క భయము తొలగిస్తూ వందయోజనముల సాగరమును లంఘించితిని'.

శ్లో|| లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా|
రావణశ్చ మయా దృష్టః త్వం చ శోకపరిప్లుతా||71||
ఏతత్తే సర్వ మాఖ్యాతం యథావృత్త మనిందితే|
అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథే రహమ్||72||
తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్త మిహాగతమ్|
సుగ్రీవ సచివం దేవి బుద్ద్యస్వ పవనాత్మజమ్||73||

స|| రాక్షసాకులా లంకా చ అపి మయా రాత్రౌ ప్రవిష్టా మయా రావణశ్చ దృష్టః శోకపరిప్లుతా త్వం చ||అనిందితే దేవి ఏతత్ యథావృతం తే ఆఖ్యాతం | మమ అభిభాషస్వ | అహం దాశరథేః దూతః||దేవి రామకృతోద్యోగం త్వన్నిమిత్తం ఇహ ఆగతం తం మామ్ సుగ్రీవ సచివం పవనాత్మజం బుద్ధ్యస్వ||

తా|| ' రాక్షసులతో నిండి యున్న లంకానగరము రాత్రి ప్రవేశించి రావణుని కూడా చూచి , శోకములో మునిగియున్న నిన్ను చూచితిని. దోషములులేని ఓదేవీ! ఈ వృత్తాంతము యథా తథము గా వివరించితిని. నాతో మాట్లాడుము. నే దాశరథి దూతను. ఓ దేవి నీ కోసమై రామునిచేత నియోగింపబడి ఇక్కడికి వచ్చిన పవనాత్మజుని నన్ను సుగ్రీవుని సచివునిగా తెలిసికొనుము'.

శ్లో|| కుశలీ తవ కాకుత్‍స్థ సర్వశస్త్రభృతాం వరః|
గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః||74||
తస్య వీర్యవతో దేవి భర్తుః తవ హితే రతః|
అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ||75||
మయేయ మసహాయేన చరతా కామరూపిణా|
దక్షిణా ది గనుక్రాంతా త్వన్మార్గవిచయైషిణా||76||

స|| సర్వశస్త్రభృతాం వరః తవ కాకుత్‍స్థః కుశలీ | గురోః ఆరాధనే యుక్తః లక్ష్మణః చ ||దేవి వీర్యవతః తవ భర్తుః తస్య హితే రతః అహం సుగ్రీవ వచనాత్ ఇహ ఏకః ప్రాప్తః||త్వన్మార్గవిచయైషిణా కామరూపిణా అసహాయేన చరతా మయా ఇయం దక్షిణా దిక్ అనుక్రాంతా||

తా|| " సమస్త అస్త్రములను ధరించువారిలో శ్రేష్ఠుడైన నీ కాకుత్‍స్థుడు కుశలము. గురువును ఆరాధించు లక్ష్మణుడు కూడా కుశలము. ఓ దేవి వీరుడు నీ భర్త యొక్క హితము కోరువాడు అగు నేను సుగ్రీవుని వచనములతో ఒక్కడినే వచ్చితిని. నీజాడ తెలిసికొనగోరి, కోరిన రూపము ధరించగల నేను ఇంకెవరి సహాయము లేకుండా తిరుగుతూ ఈ దక్షిణప్రాంతమునకు వచ్చితిని".

శ్లో|| దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశ మనుశోచతామ్|
అపనేష్యామి సంతాపం తవాభిగమశంసనాత్||77||
దిష్ట్యా హి మమ న వ్యర్థం దేవి సాగర లంఘనమ్|
ప్రాప్స్యా మ్యహ మిదం దిష్ట్వా త్వద్దర్శనకృతం యశః||78||
రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వా మభిపత్స్యతే|
సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపమ్||79||

స|| దిష్ట్యా అహం త్వన్నాశం హరిసైన్యానాం సంతాపం తవ అభిగమశంసనాత్ అపనేష్యామి||దేవి దిష్ట్యా మమ సాగరలంఘనం న వ్యర్థమ్ | దిష్ట్యా అహం త్వద్దర్శనకృతం ఇదం యశః ప్రాప్స్యామి ||మహావీరః రాఘవః చ సమిత్రబాంధవం రాక్షసాధిపం రావణం హత్వా క్షిప్రం త్వాం అభిపత్స్యతే||

తా|| " అదృష్టముకొలదీ నిన్ను చూచిన వార్త, నీ జాడతెలియక సంతాపములో మునిగియున్న వానరసైన్యముయొక్క శోకమును తొలగించును. అదృష్టము కొలదీ నీ దర్శనము చేసిన కీర్తిని నేను పొందెదను. మహావీరుడు రాఘవుడు మిత్రభాంధవులతో కలిపి రావణుని హతమార్చి త్వరలో నిన్ను చేరును".

శ్లో|| మాల్యవాన్నామ వైదేహి గిరిణా ముత్తమో గిరిః|
తతో గచ్ఛతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః ||80||
స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః|
తీర్థే నదీ పతేః పుణ్యే శంబసాదన ముద్దరత్||81||
తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి|
హనుమానితి విఖ్యాతో లోకేస్వేనైవ కర్మణా||82||

స|| వైదేహీ గిరీణాం ఉత్తమః మాల్యవాన్ నామ గిరిః | తతః కేసరీ హరిః గోకర్ణం పర్వతం గచ్ఛతి||దేవర్షిభిః దిష్టః మామ్ పితా సః మహాకపిః నదీపతేః పుణ్యే శంబసాదనం ఉద్ధరత్||మైథిలి తస్య హరిణః క్షేత్రే వాతేన జాతః స్వేన కర్మణా ఏవ లోకే హనుమాన్ ఇతి విఖ్యాతః||

తా|| " వైదేహీ పర్వతములలో ఉత్తమమైనది మాల్యవంతమనే పర్వతము. అచటినుండి కేసరి అనబడు వానరుడు గోకర్ణమనే పర్వతము వెళ్ళెను. దేవఋషుల ఆదేశానుసారము నా తండ్రి ఆ పుణ్య నదీతీరములో శంబశాదనుని సంహరించెను. ఓ మైథిలీ ఆ వానరుల క్షేత్రములో వాయుదేవుని అనుగ్రహముతో జన్మించిన నేను నా చేతల వలన హనుమంతుడు అనే పేరుతో పేరుపొందితిని".

శ్లో|| విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః|
అచిరాత్ రాఘవో దేవి త్వా మితో నయితాఽనఘే||83||
ఏవం విశ్వాసితా సీతా హేతుభిః శోకకర్శితా|
ఉపపన్నై రభిజ్ఞానై ర్దూతం తమవగచ్ఛతి||84||
అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ|
నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం||85||

స|| వైదేహి విశ్వాసార్థం మయా భర్తుః గుణాః ఉక్తాః | దేవి రాఘవః అచిరాత్ త్వాం ఇతః నయితా అనఘే| శోకకర్శితా సీతా ఏవం హేతుభిః విశ్వశితా ఉపపన్నైః అభిజ్ఞానైః తం దూతం అవగచ్ఛతి||జానకీ అతులం హర్షం గతా చ ప్రహర్షేణ వక్రపక్ష్మాభ్యాం నేత్రాభ్యాం ఆనందజం జలం ముమోచ||

తా|| "ఓ వైదేహీ నీకు విశ్వాసము కలిగించుటకు నీ భర్త గుణములను చెప్పితిని. ఓ దేవి రాఘవుడు అచిరకాలములో వచ్చి నిన్ను తీసుకుపోవును". శోకములో మునిగియున్న సీతా కూడా హేతువులతో విశ్వాసము పొంది ఆ వానరుని రాముని దూతగా గుర్తించెను. జానకి అత్యంత ఆనందముతో అందమైన కనుబొమలద్వారా కన్నీళ్ళు కార్చెను.

శ్లో|| చారు తద్వదనం తస్యా స్తామ్రశుక్లాయతేక్షణం|
అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్||86||
హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా|
అథోవాచ హనుమాంస్తాముత్తరం ప్రియదర్శనామ్||87||

స|| విశాలాక్షాయాః తస్యాః చారు తామ్రశుక్లాయతేక్షణం తత్ వదనం రాహుముక్తః ఉడ్డురివ అశోభత||సా హనుమంతం వ్యక్తం కపిం మన్యతే అన్యథా ఇతి అథ హనుమాన్ ప్రియదర్శనాం తాం ఉత్తరం ఉవాచ||

తా|| ఆ ఎర్రని అంచుగల కళ్లతో ఆ విశాలాక్షి ముఖము రాహువు ముఖమునుండి వివడిన చంద్రుని వలె శోభించెను. ఆమె హనుమంతుడు వానరుడే ఇంకొకడు కాడు అని గ్రహించెను. అప్పుడు హనుమంతుడు ప్రసన్నమైన చూపులుగల ఆమె తో ఇట్లు పలికెను.

శ్లో|| ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసిహి మైథిలి|
కింకరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహమ్||88||

స|| మైథిలి ఏతత్ సర్వం ఆఖ్యాతం సమాశ్వసిహి| కిం కరోమి కథం వా రోచతే | అహం ప్రతియామి ||

తా|| "ఓ మైథిలీ ఇదంతా సర్వస్వము చెప్పితిని విశ్వసింపుము. ఏమి చెసినచో సంతోషపడుదువో చెప్పుము. నేను తిరిగి వెళ్ళెదను".

శ్లో|| హతేఽ సురే సంయతి శంబసాదనే
కపిప్రవీరేణ మహర్షి చోదనాత్|
తతోఽ స్మి వాయుప్రభవో హి మైథిలి
ప్రభావతః తత్ప్రతిమశ్చ వానరః||89||

స|| మైథిలి సంయతి శంబసాదనే అసురే కపిప్రవరేణ మహర్షిచోదనాత్ హతే సతి అథ వాయుప్రభవః ప్రభావతః తత్ప్రతిమః వానరః అస్మి||

తా|| "ఓ మైథిలీ మహర్షుల అదేశానుసారము కపిప్రవరుడు శంబసాదనుని హతమార్చెను. మహర్షుల దీవెనలతో వాయుదేవుని వరప్రసాదముగా పుట్టి ప్రభావము లో వాయుదేవునితో సమానమైన వాడను".

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచత్రింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముపది ఇదవ సర్గ సమాప్తము.

|| om tat sat||